శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 26 మే 2017 (15:47 IST)

సీఎం యోగిని కలవాలంటే.. సబ్బుతో స్నానం చేసి పౌడర్ - సెంటు పూసుకోవాలి!

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్... బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైనశైలిలో పాలన సాగిస్తూ ముందుకు వెళుతున్నారు. గత ముఖ్యమంత్రుల కంటే భిన్నంగా పాలించడమే కాకుండా,

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్... బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైనశైలిలో పాలన సాగిస్తూ ముందుకు వెళుతున్నారు. గత ముఖ్యమంత్రుల కంటే భిన్నంగా పాలించడమే కాకుండా, ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నా. అనేక కీలక, కఠిన నిర్ణయాలు తీసుకుని వాటిని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, సీఎం యోగి ఆదిథ్యనాథ్‌ను దళితులు కలవాలంటే సబ్బులు, షాంపులతో స్నానం చేసి పౌడర్, సెంటు రాసుకోవాలని అపుడే సీఎంను కలిసేందుకు అనుమతిస్తామని ఆ రాష్ట్ర అధికారులు చెప్పడం కాస్త విడ్డూరంగా ఉంది. దీన్ని నమ్మలేకపోతున్నా ఇది ముమ్మాటికీ నిజం.
 
గురువారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముషార్ దళితవాడకు సీఎం యోగి వస్తున్నారంటూ... అక్కడున్న దళితులకు కుషాయినగర్ జిల్లా అధికారులు సబ్బులు, షాంపూలు, సెంటులు, పౌడర్లు పంపిణీ చేశారట. ముఖ్యమంత్రిని కలవాలంటే స్నానం చేసి, సెంటు, పౌడరు పూసుకోవాలని అధికారులు ఆదేశించారట.
 
ఈ సందర్భంగా ఓ దళిత నాయకుడు మాట్లాడుతూ, సీఎంను కలవడానికి తాము స్నానం చేసి సెంటు పూసుకొని వెళ్లాల్సి వచ్చిందని తెలిపాడు. అయితే, యోగి వచ్చినందుకు కొత్తగా మరుగుదొడ్లు నిర్మించారని, రోడ్లకు మరమ్మతులు చేశారని, వీధి దీపాలు కూడా అమర్చారని దళితవాడ వాసులు చెప్పారు. ఏది ఏమైతేనేంగానీ సీఎం పుణ్యమాని తమ వాడకు కొత్త వెలుగు వచ్చిందని దళితులు చెప్పడం కొసమెరుపు.