ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 29 జనవరి 2019 (13:51 IST)

లంచం ఇస్తే నిందితుడిని అరెస్టు చేస్తా.. రేప్ బాధితురాలికి ఎస్.ఐ వేధింపులు

రేప్ కేసులో బాధితుడుని అరెస్టు చేసేందుకు సీఐ ఒకరు లంచం డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని వారణాసిలో 2018 సెప్టెంబరు నెలలో ఓ అత్యాచారం జరిగింది.
 
నిందితుడు నబిన్ ఖురేషీపై కేసు పెట్టి అతన్ని అరెస్టు చేయాలంటూ బాధితురాలు.. స్థానిక లోహతా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసు అధికారి శంషేర్ ఆలం నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు. జామకాయలు తినాలి… డబ్బులివ్వు… నిందితుడిని అరెస్టు చేస్తా అని పరోక్షంగా అడుగుతూ వచ్చారు. ఎన్నిసార్లు అడిగినా ఎస్.ఐ నుంచి అదే సమాధానం రావడంతో బాధితురాలు సరేనంది. తన ఇంటికి సీఐని పిలిపించుకుని డబ్బులు ఇచ్చింది. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
దీన్ని బాధితురాలి కుటుంబ సభ్యులు లంచం ఇవ్వడాన్ని తమ మొబైల్ ఫోనులో వీడియో తీశారు. అత్యాచారం జరిగితే న్యాయం చేయాల్సింది పోయి.. ఈ పోలీసు ఇలా ప్రవర్తించాడు అంటూ లంచం తీసుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. వీడియో వైరల్ అయి.. చివరకు ఉన్నతాధికారులకు చేరింది. వారణాసి ఎస్ఎస్పీ ఆనంద్ కులకర్ణి తక్షణం స్పందించి ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేశారు.