శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2017 (11:00 IST)

పిల్లనిచ్చి, పెళ్లి చేసిన అత్తామామలపైనా చేజేసుకున్నాడు.. దేహశుద్ధి చేశారు..

పిల్లనిచ్చి, పెళ్లి చేసిన అత్తా మామలపైనా చేయి చేసుకున్నాడు. స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌కు చెందిన ప్రీతి అనే మహిళక

పిల్లనిచ్చి, పెళ్లి చేసిన అత్తా మామలపైనా చేయి చేసుకున్నాడు. స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌కు చెందిన ప్రీతి అనే మహిళకు ఎనిమిదేళ్ల కిందట సంజయ్ అనే వ్యక్తితో పెళ్లయ్యింది. వారికి ఇద్దరు పిల్లలు. పెళ్లయినప్పటి నుంచి ఆమె హింసను ఎదుర్కొంటూ వచ్చింది. 
 
మద్యానికి అలవాటు పడిన సంజయ్.. రోజూ వేధించేవాడు. దీంతో ఆమె తన పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది. సంజయ్ కూడా అత్తారింటికి వెళ్లాడు. త‌నతో ఇంటికి రావాల్సిందిగా ప‌ట్టుబ‌ట్టాడు. దీనికి ప్రీతి అంగీక‌రించ‌లేదు. దీంతో భార్య, అత్తమామలపై చేజేసుకున్నాడు. 
 
అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌ను గ‌మ‌నించిన స్థానికులు, ప్రీతి త‌ర‌ఫు బంధువులు సంజ‌య్‌పై దాడి చేశారు. చితక్కొట్టారు. కాళ్లు, చేతులు కట్టేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంజయ్‌ని అదుపులోకి తీసుకుని గృహహింస చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు.