శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (13:00 IST)

'ఓం' అని ఉచ్ఛరించినా వివాదమవుతోంది : నరేంద్ర మోడీ ఆవేదన

ప్రస్తుత పరిస్థితుల్లో 'ఓం' అని మాట్లాడినా వివాదాస్పదమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తంచేశారు. ఆకాశవాణి రూపొందించిన ‘రామ్‌చరిత్‌ మానస్‌’ డిజిటల్‌ ప్రతుల(సీడీ)ను సోమవారం ఆయన ఢిల్లీలో ఆవిష్కరించారు.
 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో ‘ఓం’ అని ఉచ్ఛరించినా వివాదంగా మారుతోందన్నారు. దేశంలో ప్రతిదానికీ సిద్ధాంతరాద్ధాంతాలు రేగుతున్న నేటి వాతావరణంలో ఓంకారం కూడా రచ్చలు - రావిళ్లకు దారితీసే వివాదం అవుతుందేమోనని సందేహం వ్యక్తం చేశారు. 
 
‘రామ్‌చరిత్‌ మానస్‌’ భారతీయ ధర్మాన్ని ప్రతిబింబించే ఒక గొప్ప ఇతిహాసమని కొనియాడారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన ఆకాశవాణిపైనా మోడీ ప్రశంసల వర్షంకురిపించారు. ఆ సంస్థ వద్ద పలువురు ప్రముఖ కళాకారులకు చెందిన 9 లక్షల గంటల ఆడియో రికార్డింగ్‌లు ఉన్నాయని.. అది అమూల్యమైన కలెక్షన్‌ అని, వాటిని శాశ్వతంగా భద్రపరచాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు.