మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (17:19 IST)

తల్లి తలను బలివ్వ‌మ‌ని కాళీమాత కోరిందనీ.. అన్నంత పని చేసిన తనయుడు

ప్రతి ఒక్కరికి కలలు వస్తుంటాయి. ఆ కలలు వచ్చినట్టుగా కొందరు నిజజీవితంలోనూ నడుచుకుంటారు. మరికొందరు ప్రాక్టికల్‌గా కూడా ప్రవర్తింటారు. తాజాగా కాళికామాత కలలోకి వచ్చి తల్లి తలను బలివ్వమని కోరిందనీ ఓ యువకుడ

ప్రతి ఒక్కరికి కలలు వస్తుంటాయి. ఆ కలలు వచ్చినట్టుగా కొందరు నిజజీవితంలోనూ నడుచుకుంటారు. మరికొందరు ప్రాక్టికల్‌గా కూడా ప్రవర్తింటారు. తాజాగా కాళికామాత కలలోకి వచ్చి తల్లి తలను బలివ్వమని కోరిందనీ ఓ యువకుడు.. తల్లి తలను తెగనరికి తల్లికి కానుకగా ఇచ్చాడు. పశ్చిమ బెంగాల్‌లోని పురులియా జిల్లాలో దారుణ ఘ‌ట‌న జరిగింది. 
 
ఈ జిల్లాకు చెందిన ఓ యువకుడు... క్షుద్రపూజలు చేస్తూ ఉండేవాడి. ఇతనికి కాళికామాత కలలోకి వచ్చి తల్లి తలను బలి ఇవ్వ‌మ‌ని చెప్పింద‌ట. దీంతో కాళీమాత ఆలయం ఆవరణలో నిద్రిస్తున్న త‌న త‌ల్లిని మెడ‌ను బ్లేడుతో పూర్తిగా కోశాడు. ఆ త‌ర్వాత‌ తన సోదరుడి ఇంటికి వెళ్లి, ఆ విష‌యాన్ని చెప్పాడు. దీంతో ఆయన త‌న‌ తల్లి కోసం కాళీమాత ఆల‌యానికి పరుగులు తీశాడు. త‌న సోద‌రుడు చెప్పిన‌ట్లుగానే ఆమె త‌ల‌ రక్తపుమడుగులో ప‌డి ఉండ‌టంతో ఈ ఘ‌ట‌న‌పై పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
 
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ప‌లు వివ‌రాలు తెలిపారు. రెండు రోజుల క్రితం రాత్రి పూట మృతురాలి మూడో కుమారుడైన 35 ఏళ్ల‌ నారాయణ అనే వ్య‌క్తి ఈ దారుణానికి పాల్ప‌డ్డాడు. స‌దరు నిందితుడు తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడ‌ని, అలా చేస్తే కుటుంబానికి మంచి జరుగుతుందని దేవత త‌న‌తో చెప్పింద‌ని అన్నాడ‌ని తెలిపారు.