1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (10:34 IST)

కన్నబిడ్డలను వదిలి.. ఇన్‌స్టాగ్రామ్ ప్రేమికుడితో జంప్

Love
ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ కోసం కన్నబిడ్డలను అనాధలుగా వదిలి పారిపోయింది.. ఓ తల్లి. ఈ ఘటన తమిళనాడులోని సేలంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ వ్యామోహం టీనేజ్ పిల్లల నుంచి పెద్దల వరకు వుంది. ఇన్‌స్టాగ్రామ్ కారణంగా ఎందరో వేలు వేలు సంపాదించుకుంటున్నారు. అయితే కొందరు పెడదారిన పడుతున్నారు. ఇలాంటి ఘటనే సేలంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. సేలంకు చెందిన 28 ఏళ్ల సుదర్శన.. గత పదేళ్ల క్రితం కార్తీక్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు వున్నారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన సుదర్శన.. అందులోనే ఎక్కువ సమయం గడిపేది. 
 
ఈ క్రమంలో మాధేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. సుదర్శనను ఇది సరికాదని భర్త పలుమార్లు హెచ్చరించాడు. అయినా ఆమె పట్టించుకోలేదు. ఇటీవల సుదర్శన పిల్లలను అనాధలుగా వదిలిపెట్టి ప్రేమికుడితో పారిపోయింది. 
 
ఈ ఘటనపై భర్త కార్తిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను ప్రారంభించారు. ఈ దర్యాప్తులో సుదర్శన ఇన్ స్టాగ్రామ్ ప్రేమికుడితో జంప్ అయినట్లు తేలింది. పరారిలో వున్న వారిని పోలీసులు గాలిస్తున్నారు.