శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 8 జులై 2017 (11:59 IST)

కట్టుకున్న భర్తను వద్దని ప్రియుడిని పెళ్ళాడిన భార్య.. దగ్గరుండి పెళ్లి చేసిన మాజీ భర్త

అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను కాదని ప్రియుడిని పెళ్లి చేసుకుందో భార్య. పైగా, ఈ పెళ్లి కూడా మాజీ భర్తే దగ్గరుండి చేయించాడు కూడా. కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా చింతామణిలో జరిగింది. ఈ వివరాలను పరిశీల

అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను కాదని ప్రియుడిని పెళ్లి చేసుకుందో భార్య. పైగా, ఈ పెళ్లి కూడా మాజీ భర్తే దగ్గరుండి చేయించాడు కూడా. కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా చింతామణిలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
చింతామణి పట్టణంలోని అశ్విని లేఅవుట్‌కు చెందిన రచనకు చింతామణి తాలూకాలోని పెద్దూరు గ్రామానికి చెందిన ఈశ్వరగౌడతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే గత కొంతకాలం నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి 
 
ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్‌లో భర్త ఈశ్వర గౌడ నుంచి విడాకులు తీసుకొని ఆమె బాబు, పాపతో విడిగా ఉంటున్నారు. రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షురాలైన రచనకు ఆమె స్వయంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలో డ్రైవర్‌గా పని చేస్తున్న మంజునాథ్‌తో పరిచయం ఏర్పడింది. 
 
ఈ పరిచయం ప్రేమగా మారింది. రచన మాజీ భర్త ఈశ్వర్‌ గౌడకు ఆమె విషయం చెప్పారు. మాజీ భర్త సహకారంతో రచన ఇంట్లోనే ఆమె, మంజునాథ్‌లు దండలు మార్చుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. కొత్త దంపతులు ఈశ్వరగౌడ ఆశీర్వాదం తీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.