శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 25 జూన్ 2018 (09:42 IST)

బిడ్డలతో కలిసి రైలులో నుంచి దూకిన మహిళ... చిన్నగాయం కూడా...

అనేకమంది కుటుంబ కలహాల కారణంగా బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. ఇలా పాల్పడేవారు కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే.. మరికొందరు రైలు పట్టాలపై పడుకోవడం, ఇంకొందరు రైలు నుంచి దూకడం, మరికొందరు విషం, పురుగుల మందు తీసుక

అనేకమంది కుటుంబ కలహాల కారణంగా బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. ఇలా పాల్పడేవారు కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే.. మరికొందరు రైలు పట్టాలపై పడుకోవడం, ఇంకొందరు రైలు నుంచి దూకడం, మరికొందరు విషం, పురుగుల మందు తీసుకుని చనిపోయేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే, ఈ భూమిపై నూకలు ఉంటే మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వారికి చిన్నపాటి గాయం కూడా కాదు. ఇలాంటి ఘటనే ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
 
మధ్యప్రదేశ్, భూర్హన్‌పూర్‌ జిల్లాకు చెందిన తబాస్సుమ్ అనే మహిళ కుటుంబ కలహాల కారణంగా తన బిడ్డతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో నేపానగర్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. కొద్దిసేపు స్టేషన్‌లో ఉండి... సరిగ్గా పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైల్వే స్టేషన్‌ను సమీపిస్తున్న వేళ, ఒక్కసారిగా పట్టాలపైకి దూకింది. చుట్టూ చూస్తున్న జనాలు అరుస్తుండగానే రైలు వారిపై నుంచి వెళ్లిపోయింది. అయితే, వారిద్దరీ చిన్నపాటి గాయం కూడా కాలేదు. 
 
తల్లీకూతుళ్లు ట్రాక్‌కు మధ్యగా వీరు పడటంతో, రైలు వారి మీదుగా వెళ్లిపోయింది. ఆమె బిడ్డను తన చేతులతోనే పట్టుకుని, షాక్‌కు గురికాగా, ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్తతో విడాకులు తీసుకున్న తాను, ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.