శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 జులై 2017 (11:00 IST)

కొత్త జంటలకు సీఎం యోగి నయా గిఫ్ట్.. తెరిచి చూస్తే షాక్... కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు...

కొత్తగా వివాహం చేసుకున్న వారికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వినూత్న బహుమతులను అందజేయనున్నారు. ఇందుకోసం ఓ స్కీమ్‌ను ఆయన ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'మిషన్ పరివార్

కొత్తగా వివాహం చేసుకున్న వారికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వినూత్న బహుమతులను అందజేయనున్నారు. ఇందుకోసం ఓ స్కీమ్‌ను ఆయన ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'మిషన్ పరివార్ వికాస్' కార్యక్రమంలో భాగంగా ఈ కిట్లు అందజేయనుంది.
 
బహుమతి కిట్‌లో కండోమ్‌లు, ఇతర గర్భనిరోధక సాధనాలు ఉన్నాయి. ఈ కిట్లకు 'నయీ పహల్' అనే పేరు పెట్టారు. ఈ నెల 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆశా వర్కర్లు ఈ కిట్లను అందజేస్తారు. 
 
ఈ కిట్లలో సురక్షిత శృంగారం, ప్రసవాల మధ్య సమయం, కుటుంబ నియంత్రణకు సంబంధించిన సమాచారాన్ని అందించే బ్రోచర్లు కూడా ఉంటాయి. దీంతో పాటు కర్చీఫ్‌లు, తువ్వాళ్లు, దువ్వెన, అద్దం, నెయిల్ కట్టర్‌ను కూడా అందిస్తారు. 
 
సాధారణంగా కొత్తగా పెళ్లయిన జంటకు ఏం బహుమతి ఇవ్వాలని చాలామంది తల బద్దలుకొట్టుకుంటారు. కానీ, యూపీలోని యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు మాత్రం ఏమాత్రం తడుముకోకుండా నయీ పహల్ కిట్లను అందజేయనుంది.