శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By PNR
Last Updated : బుధవారం, 10 సెప్టెంబరు 2014 (15:53 IST)

"మలాయ్‌ రొయ్యల కర్రీ" విత్ మిల్క్ క్రీమ్..!

కావలసిన పదార్థాలు :
తాజా పచ్చి రొయ్యలు.. అర కిలో
ఉల్లిపాయలు.. ఆరు
అల్లంవెల్లుల్లి పేస్ట్.. ఒక టీ.
టొమోటో పేస్ట్.. రెండు కప్పులు
మిల్క్ క్రీమ్.. ఒక కప్పు
కారం, నూనె.. సరిపడా
కసూరి మేథీ.. ఒక టీ.
పచ్చిమిర్చి.. 8
కొత్తిమీర.. ఒక కట్ట
వెల్లుల్లి.. 4 రెబ్బలు
అల్లం ముక్కలు.. కొద్దిగా
జీడిపప్పులు.. ఆరు
గరం మసాలా.. 2 టీ.
ఉప్పు.. సరిపడా
 
తయారీ విధానం :
పచ్చి రొయ్యలను శుభ్రం చేసి వాటికి ఉప్పు, కారం కలిపి ఉంచాలి. బాణలిలో నూనె పోసి కాగాక అందులో రొయ్యల్ని వేసి దోరగా వేయించి తీయాలి. అదే నూనెలో ఉల్లిపాయ ముద్దను వేసి కాసేపు వేయించాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించాలి. తరువాత కారం, పచ్చిమిర్చి ముద్ద.. అల్లం, వెల్లుల్లి తరుగులను కూడా వేసి కలిపి వేయించాలి. చివరిగా టొమోటో పేస్ట్‌ను కలిపి వేసి, కలియబెట్టి ఉడికించాలి. 
 
కాసేపటి తర్వాత వేయించి ఉంచిన రొయ్యలను వేసి, ఉప్పు సరిజూసుకుని సన్నటి మంటపై ఉడికించాలి. తరువాత కసూరి మేథీ, గరంమసాలా, జీడిపప్పులను వేసి బాగా కలియబెట్టి మరికాసేపు ఉడికించాలి. చివరగా కూర కిందికి దించేముందు మిల్క్ క్రీమ్ కలపాలి. సర్వింగ్ చేసే ముందు కొత్తిమీర తురుము చల్లి వడ్డించాలి. అంతే ఘుమఘుమలాడే మలాయ్ ప్రాన్ కర్రీ సిద్ధం.