మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By
Last Updated : గురువారం, 7 మార్చి 2019 (14:20 IST)

హనుమంతుని శరీరమంతా సిందూరం ఉంటుంది.. ఎందుకు..?

సిందూరం అంటే పెట్టుకునే కుంకుమ. ఆంజనేయునికి సింధూరం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే.. సీతమ్మ పాపిట బొట్టు పెట్టుకోవడం చూసిన ఆంజనేయుడు ఓసారి ఎందుకలా పెట్టుకుంటున్నావని సీతమ్మను అడిగాడు. అందుకు సీతమ్మ నవ్వుతూ ఈ పాపిట బొట్టువలన నేను రామప్రేమను పొందానని చెప్పారు.
 
ఈ బొట్టు రాముల వారికి చాలా ఇష్టమని చెప్పారు. దాంతో వెంటనే ఆంజేయుడు సిందూరాన్ని తన శరీరమంతా పూసుకున్నాడు. ఆయనకు ఆపాదమస్తకం రోమాలు ఉండడం చేత ఆ సిందూరం వెంటనే రాలిపోయేది. అప్పుడు హనుమంతుడు నూనెతో కలిపిన గంగ సిందూరాన్ని శరీరమంతా రాసుకున్నాడు. 
 
ఇలాంటి అమాయకపు పనిచేసిన హనుమంతుని చూసిన రాముల వారు.. ఈ రూపంతో నిన్ను ఎవరైతే సేవిస్తారో వారికి నేను ప్రసన్నుడును అని అన్నారు. అటువంటి భక్తులకు సమస్త దోషాలు తొలగి సుఖశాంతులు పొందుతారని వరం ఇచ్చారు. అందుకే హనుమంతుని శరీరమంతా సిందూరం రాసి ఉంటుంది.  
 
కనుక ప్రతిరోజూ కాకపోయినా వారంలో రెండుసార్లు హనుమంతుని సింధూరాభిషేకం చేయించి.. స్వామివారికి నచ్చిన ఆహారాలను నైవేద్యంగా సమర్పించి పూజలు చేస్తే వారు కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయి. దాంతో పాటు రాములవారి దర్శనం కూడా దక్కుతుంది.