1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 13 అక్టోబరు 2014 (19:53 IST)

వరంగల్: శ్వేతార్కమూల గణపతిని విభూతిని ధరిస్తే?

వరంగల్ జిల్లా ఖాజీపేటలో అలరారుతున్న శ్వేతార్కమూల గణపతిని పూజిస్తే సర్వదోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. తెల్లజిల్లేడు చెట్టు మూలంతో గణపతి ఆకృతి సంతరించుకుంది. 
 
సాధారణంగానే గణపతిని పూజించడం వలన విఘ్నాలు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది. ఇక శ్వేతార్కమూల గణపతి విషయానికి వచ్చేసరికి ఈ విఘ్నేశ్వరుడు మహిమాన్వితుడని ఆలయ నిర్వాహకులు అంటున్నారు. 
 
శ్వేతార్కమూల గణపతిని పూజించడం వలన విఘ్నాలు తొలగిపోవడమే కాదు, అనేక రకాల దోషాలు నశిస్తాయని వారంటున్నారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ స్వామి సన్నిధిలోనే అనునిత్యం హోమం జరుగుతూ వుంటుంది. ఈ హోమంలోని విభూతిని ప్రతి మంగళవారం సాయంత్రం కొంచెం కొంచెంగా భక్తులకు ఇస్తుంటారు.
 
ఈ విభూతిని భక్తులు అపురూపంగా భావిస్తారు. అందువలన దీనిని అందుకునేవారి సంఖ్య అధికంగానే వుంటుంది. ఈ విభూతిని ఇంట్లోని పూజా మందిరంలో వుంచి, అనునిత్యం ధరించడం వలన అన్నిరకాల విఘ్నాలు ... సమస్త దోషాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తుంటారు.