1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 22 నవంబరు 2014 (20:34 IST)

పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్న చీఫ్ సెక్రటరీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ క్రిష్ణారావు శనివారం సాయంత్రం తిరుచానూరు పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుచానూరులో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో తన కుమార్తె కీర్తనల ఆలాపనను తిలకించడానికి విచ్చేసిన ఆయన పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు. 

 
ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన కుటుంబంతో కలసి అమ్వమారిని దర్శించుకున్నారు. ఆయనకు తిరుపతి జేఈవో పోలా భాస్కర్ తీర్థ ప్రసాదాలను అందజేశారు.