గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 మార్చి 2017 (11:48 IST)

శ్రీవారి ఆలయంలో 8 నుంచి తెప్పోత్సవాలు: హుండీలో పడిన రూ.4 కోట్ల పాత నోట్లు మారేనా?

కలియుగ వైకుంఠం తిరుమల వెంకన్న స్వామి ఆలయంలో మార్చి 8వ తేదీ నుంచి 12 వరకు తెప్పోత్సవాలు జరగనున్నాయి. శుక్రవారం నుంచి భక్తులకు 48690 ఆర్జిత సేవా టిక్కెట్లను అందుబాటులో ఉంచినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం

కలియుగ వైకుంఠం తిరుమల వెంకన్న స్వామి ఆలయంలో మార్చి 8వ తేదీ నుంచి 12 వరకు తెప్పోత్సవాలు జరగనున్నాయి. శుక్రవారం నుంచి భక్తులకు 48690 ఆర్జిత సేవా టిక్కెట్లను అందుబాటులో ఉంచినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు వెల్లడించారు. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఉగాది నుంచి మొబైల్‌ యాప్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చన్నారు. కాగా... గత ఏడాది ఫిబ్రవరి కంటే ఈ ఏడాది 40 వేల మంది భక్తులు అధికంగా స్వామివారిని దర్శించుకున్నారని, హుండీ ఆదాయం మాత్రం కొంతమేర తగ్గిందని ఈవో సాంబశివరావు తెలిపారు. 
 
ఇదిలా ఉంటే.. ఆపద మొక్కుల వాడికే పెద్ద ఆపద వచ్చిపడింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీలో కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన పాత 500, 1000 రూపాయల నోట్లు ఏకంగా రూ.4కోట్లు రావడంతో.. ఆ సొమ్మును ఏం చేయాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ డబ్బును ఏం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వు బ్యాంకుకు లేఖలు రాశారు. వాళ్ల నుంచి తగిన సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. 
 
హుండీలో 4 కోట్ల రూపాయలకు పైగా పాతనోట్లు వచ్చినట్లు టీటీడీ ఈఓ సాంబశివరావు తెలిపారు. కాగా రద్దు చేసిన పాతనోట్లు పది కన్నా ఎక్కువ ఉంటే కనీసం 10వేల రూపాయలు లేదా పాతనోట్ల విలువకు రెట్టింపు మొత్తంలో జరిమానా విధిస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ లెక్కన చూస్తే టీటీడీకి రూ.8కోట్ల జరిమానా విధిస్తారా లేకుంటే రూ.4కోట్ల పాత నోట్లు తీసుకుని కొత్త నోట్లు ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది.