35 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు: రియో గేమ్స్లో..
భారత మహిళల హాకీ జట్టు ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం 1980లో మాస్కో ఒలింపిక్స్ తర్వాత భారత మహిళలు ఒక్కసారి కూడా అర్హత సాధించలేకపోయారు. ఇంత సుదీర్ఘ విరామం తర్వాత కల సాకారమైంది. హాకీ వరల్డ్ లీగ్ సెమీస్లో 5-6 స్థానాల కోసం శనివారం జరిగిన వర్గీకరణపోరులో భారత్ 1-0తో జపాన్పై విజయం సాధించింది.
టోర్నీలో 5వ స్థానాన్ని కైవసం చేసుకుంది. 13వ నిమిషంలో స్ట్రయికర్ రాణీ రాంపాల్ విన్నింగ్ గోల్ చేసింది. వందనా కటారియా కొట్టిన షాట్ జపాన్ కీపర్కు తగిలి రీ బౌండ్ అయింది. అవకాశం కోసం వేచి చూస్తున్న రాణి.. ఆ బంతిని వెంటనే గోల్లోకి పంపి భారత్కు 1-0 ఆధిక్యాన్నిచ్చింది. రాణీ మ్యాచ్ విన్నింగ్ గోల్ చేసినా.. ఒలింపిక్ ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయంటే అందుకు సవిత కీపింగే ప్రత్యేకంగా నిలిచింది.
జపాన్కు దక్కిన ఓ అరడజను చాన్సులను సవిత నిలువరించి మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. 1980లో మాస్కో ఒలింపిక్స్లో భారత అమ్మాయిల టీమ్ తొలిసారిగా ఆడింది. ఒలింపిక్స్కు అర్హత సాధించిన దేశాల స్థానాలు భర్తీ అయ్యేకొద్దీ.. ఈ టోర్నీలో 5వ స్థానంలో నిలిచిన భారత్ రియో బెర్త్పై స్పష్టత వస్తుంది.