శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 23 ఆగస్టు 2016 (16:51 IST)

రియో ఒలింపిక్స్ కోసం రూ.810 కోట్లు ఖర్చు.. వచ్చిన పతకాలు 2.. ఇది మన భారత్ తీరు

రియో ఒలింపిక్స్ క్రీడల కోసం భారత్ అక్షారాలా 810 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. కానీ, భారత క్రీడాకారులు తెచ్చిన పతకాలు కేవలం రెండే రెండు. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ మ్యాచ్‌లో తెలుగమ్మాయి పీవీ సింధు రజ

రియో ఒలింపిక్స్ క్రీడల కోసం భారత్ అక్షారాలా 810 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. కానీ, భారత క్రీడాకారులు తెచ్చిన పతకాలు కేవలం రెండే రెండు. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ మ్యాచ్‌లో తెలుగమ్మాయి పీవీ సింధు రజత పతకం గెలుచుకోగా, మహిళల రెజ్లింగ్ విభాగంలో సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మిగిలిన ఏ ఒక్క క్రీడాకారుడు కూడా అంచనాలకు తగిన విధంగా రాణించలేదు. ఫలితంగా రియో ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ 69వ స్థానంలో నిలిచింది. 
 
మన దేశం రియో ఒలింపిక్స్ క్రీడాకారులు, శిక్షణ కోసం మొత్తం 810 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ మొత్తాన్ని గత నాలుగేళ్ల కాలంలో ఖర్చు చేశారు. శిక్షణా సెంటర్లు, కోచ్‌లు, ఇతర మౌలిక సౌకర్యాల కోసం 750 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టగా, నేషనల్ స్పోర్ట్ డెవలప్‌మెంట్ ఫండ్ ద్వారా 22.7 కోట్ల రూపాయలు, టార్గెట్ ఒలింపిక్ పోడియం ప్రోగ్రామ్ కార్యక్రమం కింద 38 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అంటే మొత్తం దాదాపు 810 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. 
 
అదేసమయంలో రియో ఒలింపిక్స్‌లో రాణించి 67 పతకాలను గెలుచుకొని ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచిన బ్రిటన్‌.. పతకాల సాధన కోసం క్రీడాకారులపై ఖర్చు పెట్టిన రూ.2747 కోట్లు. అంటే ఒక్కో మెడల్ కోసం సగటున 41 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్టు బ్రిటన్ స్పోర్ట్ అథారిటీ వెల్లడించింది. బ్రిటన్ బడ్జెట్ కేటాయింపులను పరిశీలించగా ఈ నాలుగేళ్లలో ఒలింపిక్స్ ప్రిమరేషన్స్ కోసం క్రీడాకారుల శిక్షణ, శిక్షణా వసతుల కోసం మొత్తం 2,380 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.