ఐఎస్ఎల్ టోర్నీ ఫైనల్లోకి అడుగెట్టిన కేరళ బ్లాస్టర్స్!
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నమెంట్లో కేరళ బ్లాస్టర్స్ జట్టు ఫైనల్లోకి అడుగుపెట్టింది. మంగళవారం జరిగిన రెండో లెగ్ సెమీ ఫైనల్ పోరులో ఆ జట్టు 4-3 గోల్స్ తేడాతో చెన్నై ఫుట్బాల్ క్లబ్ జట్టును మట్టికరిపించి టైటిల్ పోరుకు సిద్ధమైంది.
ఆద్యంతం ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్లో నిర్ధేశిత సమయం ముగిసే సరికి ఇరు జట్లు 3-3 గోల్స్తో సరిసమానంగా నిలిచాయి. దీంతో మ్యాచ్ను మరికొంతసేపు పొడిగించాల్సి వచ్చింది. అయితే 117వ నిమిషంలో స్కాట్లాండ్ ఆటగాడు స్టీఫెన్ పాల్ పియర్సన్ అద్భుత గోల్ను సాధించి కేరళ బ్లాస్టర్స్ను ఫైనల్కు చేర్చాడు.