శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 17 అక్టోబరు 2014 (22:25 IST)

అతుల్ శర్మ చంపేస్తానని బెదిరించాడు: లియాండర్ పేస్!

క్రికెటర్ అతుల్ శర్మ తనను, తన కుమార్తెను చంపుతానంటూ హెచ్చరికలు చేస్తున్నాడంటూ భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఆరోపిస్తూ.. ముంబై నగర పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశాడు. అయితే, వీరిద్దరి మధ్య విభేదాలు పొడచూపడానికి కారణాలు లేకపోలేదు. 
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల్లో ఒకప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తరపున ఆడిన అతుల్ శర్మకు పేస్ మాజీ భార్య రియా పిళ్లైతే వివాహేతర సంబంధం ఉన్నట్టు ప్రచారం ఉంది. 
 
గత కొంతకాలం నుంచి విడిగా ఉంటున్న పేస్, రియాలు కుమార్తె విషయంలో ముంబై స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు. కూతురు రక్షణ బాధ్యత తనకే అప్పగించాలని పేస్ కోరాడు. కుమార్తెను తనకే అప్పగించాలని అటు రియా కూడా కోరుతోంది.
 
ఈ విషయంలో అతుల్ శర్మ జోక్యం చేసుకుని రియా పిళ్లైకు అండగా నిలిచి లియాండర్ పేస్‌కు బెదిరింపులు చేస్తున్నట్టు సమాచారం. దీంతో అతుల్ శర్మపై పేస్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.