గోవాలో సానియా మీర్జా, పరిణీతి చోప్రా: సీఫుడ్ రుచుల్ని టేస్ట్ ఇస్తూ...
హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గోవాలో స్వల్ప విరామాన్ని సరదాగా ఎంజాయ్ చేస్తోంది. గెలుపుతో సీజన్ను ముగించిన సానియా మీర్జా.. ఇటీవల గోవాకు వెళ్లింది. తనతో పాటు బాలీవుడ్ సుందరాంగి పరిణీతి చోప్రాతో కలిసి చిన్నపాటి టూర్ను ప్లాన్ చేసింది. ఈ కేలండర్ ఇయర్లో ఏకంగా పది డబుల్స్ టైటిళ్లు సాధించి సత్తా చాటిన సానియా మీర్జా.. ఇక ఈ ఏడాది సీజన్ ముగిసినట్లేనని ప్రకటించింది.
వింటర్ సీజన్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో సానియా, పరిణీతి చోప్రాలు కలిసి గోవా బీచుల్లో సరదాగా చక్కర్లు కొట్టడంతో పాటు అక్కడి నోరూరించే సీఫుడ్ రుచులను ఇష్టంగా ఆరగించేశారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి తీసుకున్న ఫొటోలను పరిణీతి చోప్రా ట్విట్టర్లో పోస్ట్ చేసింది.