గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 4 ఆగస్టు 2019 (17:16 IST)

చరిత్ర సృష్టించిన సాత్విక్ జోడీ...

థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో భారత ఆటగాళ్లు సాత్విక్ జోడీ చరిత్ర సృష్టించింది. చరిత్రలో తొలిసారిగా పురుషుల డబుల్స్‌ టైటిల్స్‌ను ఖాతాలో వేసుకుంది. థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో తెలుగుతేజం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిల జోడి అద్భుత పదర్శనను కనబరిచింది.

ఫలితంగా, చైనాకు చెందిన లి జున్ హు- యు చెన్ జంటను 21-19, 18-21, 21-18 తేడాతో మట్టికరిపించి రికార్డుల్లోకి ఎక్కింది. తొలి గేమ్‌లో పోరాడి గెలిచిన సాత్విక్-చిరాగ్ జంట... రెండో గేమ్‌ను చేజార్చకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సాత్విక్ జోడీ రెచ్చిపోయింది. చైనా జంటను ఒత్తిడిలోకి నెట్టి... చివరి గేమ్‌ను సొంతం చేసుకుంది.