మంగళవారం, 8 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 అక్టోబరు 2024 (10:37 IST)

భార్య నిద్రిస్తుండగా సుత్తితో తలపై కొట్టిన భర్త.. ఎందుకో తెలుసా?

crime scene
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని హైదర్‌షా కోటేలో మంగళవారం తెల్లవారుజామున కుటుంబ సమస్యలతో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. మృతురాలు కృష్ణవేణి (34)కి ఫంక్షన్ మెటీరియల్‌ సరఫరా చేసే దుకాణం నడుపుతున్న శ్రీకాంత్‌తో వివాహమైంది. పాఠశాలకు వెళ్లే ఇద్దరు పిల్లలతో పాటు కుటుంబం హైదర్‌షా కోటేలో ఉంది. 
 
సోమవారం సాయంత్రం కుటుంబ సమస్యలపై దంపతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కృష్ణవేణి, తర్వాత నిద్రలోకి జారుకుంది. మహిళ నిద్రిస్తుండగా, తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో, శ్రీకాంత్ సుత్తి తీసుకొని మహిళ తలపై కొట్టాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందిందని రాజేంద్రనగర్ పోలీసు అధికారి తెలిపారు.
 
అనంతరం శ్రీకాంత్, పిల్లలతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదైంది. దర్యాప్తు జరుగుతోంది.