శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : ఆదివారం, 20 మార్చి 2016 (17:48 IST)

''ఒక రొమాంటిక్ క్రైమ్'' సినిమా చూసి ఇన్‌స్పైర్ అయ్యారు.. అభయ్ కిడ్నాప్ కూడా?!

''ఒక రొమాంటిక్ క్రైమ్'' సినిమాను చూసి.. అభయ్ కిడ్నాప్ కూడా అలాగే?

హైదరాబాదులో సంచలనం సృష్టించిన పదో తరగతి విద్యార్థి అభయ్ హత్య కేసులో సీపీ మహేందర్ రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. నిందితులు చిన్నసాయి, రవి, మోహన్‌లు ఈ నెల 14వ తేదీన 'ఒక రొమాంటిక్ క్రైమ్' సినిమాను చూసి, దానిని ఫాలో అయి చంపేసినట్లుగా తేలిందని వివరించారు. సినిమాను చూసి అభయ్‌ని చంపేసిన నిందితులు.. సినిమా నటులుగా స్థిరపడేందుకు ఈ దురాగతానికి పాల్పడినట్లు సీపీ మహేందర్ తెలిపారు.  
 
ఒక రొమాంటిక్ క్రైమ్ సినిమాలో చైన్ స్నాచింగులు, కిడ్నాప్ చేయడం వంటి అంశాలతో వారు ఇన్‌స్పైర్ అయ్యారని చెప్పారు. వారికి సినిమా ఫీల్డులో రాణించాలనే కోరిక ఉంది. దీంతో ఆ సినిమాను చూసి, దానిని ఫాలో అయి, కిడ్నాప్ ద్వారా డబ్బులు సంపాదించి, సినిమా ఫీల్డులో నటులుగా ఎదగాలని భావించారని చెప్పారు. 
 
ఈ నెల 16వ తేదీన అభయ్ కిడ్నాప్, హత్య జరిగిందని.. అమాయకుడిని చంపడం దారుణమన్నారు. ముగ్గురు కలిసి అభయ్‌ని కిడ్నాప్ చేశారని చెప్పారు. నిందితులు చిన్నసాయి అలియాస్ శేషు, రవి, మోహన్‌లు అని వెల్లడించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని, రిమాండుకు తరలిస్తామని చెప్పారు. డబ్బుకోసమే అభయ్‌ని చంపినట్లు నిర్ధారణ అయినట్లు చెప్పారు. నిందితులంతా 22 ఏళ్లవారేనని చెప్పారు.