మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 5 డిశెంబరు 2019 (18:07 IST)

ప్రియుడికి అడ్డు వస్తున్నాడని భర్తను సజీవ దహనం చేసిన భార్య

ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను కాల్చేసింది ఓ భార్య. ఈ విషయాన్ని పోలీసులు ఆలస్యంగా కనుగొన్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలో గత నెల 26న ఎస్‌కేడీ నగర్‌లో అర్థరాత్రి గుడిసెలో ఉంటున్న ఓ వ్యక్తి సజీవదహనమైనట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు, గుడిసెలో ఓ వ్యక్తి దహనమైనట్లు కనుగొన్నారు. తొలుత ఇది అగ్ని ప్రమాదం అని భావించారు. 
 
కానీ ఆ తర్వాత పరిసర ప్రాంతంలో ఫిక్స్ చేసిన సీసీ కెమేరా చూసేసరికి ఎవరో గుడిసెకు నిప్పు పెట్టినట్లు రికార్డయ్యింది. అలా నిప్పుపెట్టింది ఓ మహిళగా వారు గుర్తించారు. దీనితో తమదైన శైలిలో మృతుడి భార్య వద్ద విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది.
 
మృతుడి భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తేలింది. తన ప్రియుడికి అడ్డు వస్తున్నాడన్న ఆగ్రహంతో భర్తను చంపేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అర్థరాత్రి భర్త నిద్రపోతున్నవేళ ప్రియుడితో కలిసి పూరింటికి నిప్పు పెట్టేసింది. దీనితో ఆమె భర్త సజీవ దహనమయ్యాడు.