గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (15:19 IST)

ప్రియుడికి అడ్డు వస్తున్నాడని భర్తకి విషం పెట్టిన భార్య....

వివాహేతర సంబంధం ఓ నిండు జీవితాన్ని బలి తీసుకుంది. ప్రియుడితో శృంగారానికి కట్టుకున్న భర్త అడ్డుగా వున్నాడని, అతడికి అన్నంలో విషం కలిపి పెట్టింది ఓ భార్య. అది తిన్న అతడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
పూర్తి వివరాలు చూస్తే... తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా గూడూరు మండలం కోబల్ తండాకి చెందిన 30 ఏళ్ల మోహన్, పావనిలు దంపతులు. ఐతే గత కొన్ని నెలలుగా ఆమె అదే తండాకి చెందిన శ్రీనుతో వివాహేతర సంబంధాన్ని సాగిస్తుంది. ఇది కాస్తా భర్తకు తెలిసిపోయింది. 
 
దాంతో ఈ విషయాన్ని పెద్దమనుషుల ముందు పెట్టాడు. పంచాయతీ చేసిన పెద్ద మనుషులు ఇరువుర్ని మందలించి ఇకనైనా బుద్ధిగా వుండాలని సూచించారు. కానీ పావని మాత్రం తన పద్ధతిని మార్చుకోలేదు. తన భర్త కంటే ప్రియుడే కావాలనుకున్న ఆమె పథకం ప్రకారం తన భర్తకు విషం కలిపిన ఆహారాన్ని ఇవ్వడంతో అది తిన్న అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇరుగుపొరుగువారు అతడి పరిస్థితిని గమనించి ఆసుపత్రికి తీసుకుని వెళ్లినా ఫలితం లేకుండా పోయింది.