అన్నా చెల్లెళ్లు ప్రేమించుకున్నారు.. చివరకు ప్రాణాలు తీసుకున్నారు.. ఎక్కడ?  
                                       
                  
				  				  
				   
                  				  వారిద్దరూ వరుసకు అన్నా చెల్లెళ్లు అవుతారు. కానీ, ప్రేమించుకున్నారు. ఈ విషయం బయటకు తెలిసింది. మంచి పద్దతి కాదంటూ పెద్దలు హెచ్చరించారు. దీంతో తామిద్దరం కలిసివుండటం సాధ్యం కాదనుకున్నారు. దీంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన తెలంగాణా రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా కృష్ణ మండల పరిధిలోని చేగుంట - కృష్ణ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. 
				  											
																													
									  
	 
	తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం దానాల, పర్లాపల్లి గ్రామాలకు చెందిన 70 కుటుంబాలు పత్తి చేలలో పని చేసేందుకు తెలంగాణాలోని చేగుంటకు వలస వచ్చాయి. అక్కడే తాత్కాలిక గుడారాలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. 
				  
	 
	ఈ క్రమంలో ఈరమ్మ - మున్నెల్ల దంపతులకు మణికుమార్ (25) అనే కుమారుడు ఉండగా, శాంతమ్మ - కేశవల కుమార్తె అనిత (15)లు వరుసకు అన్నా చెల్లెళ్లు అవుతారు. ఈ విషయం వారికి స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ వారిద్దరూ గత కొద్దిరోజులుగు ప్రేమించుకుంటున్నారు. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలిసింది. వారు ఇది మంచి పద్దతి కాదని హెచ్చరించారు. అప్పటి నుంచి వారు ఒకరినొకరు విడిచి ఉండటం సాధ్యం కాదని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
				  																		
											
									  
	 
	ఈ క్రమంలో శనివారం అర్థరాత్రి సమయంలో వారిద్దరూ కలిసి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. ఆ తర్వాత అనిత పట్టాల మధ్య తన చున్నీ పరవగా వారిద్దరూ దానిపై పడుకున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన రైలు ఒకటి వారిపై దూసుకెళ్లడంతో వారిద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు.