తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ బందీ చేశారు.. జేపీ నడ్డా  
                                       
                  
                  				  బీజేపీ సభను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ సర్కార్ కుట్రలు చేసిందని జేపీ నడ్డా ఆరోపించారు. కానీ, హైకోర్టు అనుమతితో సభ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అడుగడుగునా ఆంక్షలు పెట్టారని విమర్శించారు నడ్డా. 144 సెక్షన్ ఉందని జనాన్ని రాకుండా అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. 
				  											
																													
									  
	 
	తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ బందీ చేశారని అన్నారు. హనుమకొండలో జరిగిన భారీ బహిరంగ సభలో నడ్డా మాట్లాడుతూ.. నిజాం తరహాలోనే కేసీఆర్ను ప్రజలు ఇంట్లో కూర్చోబెడతారని అన్నారు. 
				  
	 
	ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొదట మద్దతు ఇచ్చింది బీజేపీనే అని జేపీ నడ్డా తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకై గల్లీలోనూ, ఢిల్లీలోనూ బీజేపీ ఫైట్ చేసిందన్నారు. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	బీజేపీ మద్దతుతోనే పార్లమెంట్లో తెలంగాణ పాస్ అయిందని గుర్తు చేశారు నడ్డా. త్వరలోనే కేసీఆర్ను తెలంగాణ ప్రజలు ఇంట్లో కూర్చోబెడతారుని బీజేపీ చీఫ్ నడ్డా అన్నారు. చివరి నిజాం కూడా ఇలాంటి ఆంక్షలే పెట్టారని నాటి ఆంక్షలను గుర్తు చేశారు నడ్డా.