గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr

వైరల్ అవుతున్న కేటీఆర్ జోక్... నవ్వకుండా ఉండలేరు..

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్... ప్రజా సమస్యలపై ఎప్పటికపుడు స్పందిస్తుంటారు. అలాగే, సందర్భోచితంగా జోక్స్ పేల్చడంలోనూ మంచిదిట్ట. దీంతో కేటీఆర్ ట్విట్టర్ ఖాతా

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్... ప్రజా సమస్యలపై ఎప్పటికపుడు స్పందిస్తుంటారు. అలాగే, సందర్భోచితంగా జోక్స్ పేల్చడంలోనూ మంచిదిట్ట. దీంతో కేటీఆర్ ట్విట్టర్ ఖాతాను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. తాజాగా కేటీఆర్ చేసిన ట్వీట్‌కు మంచి స్పందన వచ్చింది. 
 
ఈ ట్వీట్‌తోపాటు ఆయన పోస్ట్ చేసిన ఓ సందేశాన్ని చదివిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నవ్వకుండా ఉండలేరు. అయితే అది మహిళలపై కాస్త వ్యంగ్యంగా ఉండటంతో మహిళలూ... ఏమీ అనుకోవద్దు అంటీ విజ్ఞప్తి చేశారు. 
 
ఇంతకూ ఆ జోక్ ఏంటంటే… "ఒక వ్యక్తి ఓ స్వామీజీ వద్దకు వెళ్లి స్వామీ నా తప్పులను నేను ఎలా తెలుసుకోవాలి" అంటూ ప్రశ్నిస్తాడు. దీనికి స్వామీ సమాధానమిస్తూ, "నీ భార్య చేసిన ఒక తప్పును గుర్తించి.. దాన్ని సరిదిద్దుకొమ్మని ఆమెకు చెప్పు.. ఆ తర్వాత నీ తప్పులే కాదు నీ కుటుంబం తప్పులతో పాటు బంధువుల తప్పులు చివరకు నీ స్నేహితుల తప్పులు కూడా ఆమె ద్వారా ఈజీగా తెలుస్తాయి" అంటూ సమాధానమిస్తాడు.