శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (16:58 IST)

కేసీఆర్... ఓ తాగుబోతు సీఎం అందుకే కరెంట్ కష్టాలు : ఎర్రబెల్లి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఓ తాగుబోతు సీఎం అని, అందుకే తెలంగాణ ప్రజలు కరెంట్ కష్టాలు పడాల్సి వచ్చిందని టీ టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. పచ్చి తాగుబోతైన ముఖ్యమంత్రి నిర్ణయాలతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని మండిపడ్డారు. 
 
శ్రీశైలం జల విద్యుదుత్పత్తిని నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు నల్గొండలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేసి నిప్పు పెట్టారు. ఈ ఘటనను మీడియా ముఖంగా ఖండించిన ఎర్రబెల్లి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. 
 
కేసీఆర్ తన చేష్టలతో ప్రజలను తీవ్ర కష్టాలకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఉరికించి కొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణలో కరెంటు కష్టాలకు చంద్రబాబే కారణమని నిరూపిస్తే... హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ముక్కును నేలకు రాస్తానని ఛాలెంజ్ విసిరారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు.