శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 21 ఆగస్టు 2014 (15:16 IST)

గవర్నర్ అధికారాలపై రాజ్‌నాథ్ హామీ ఇచ్చారు : టీఎంపీలు

హైదరాబాద్‌లో గవర్నర్ అధికారాలపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టమైన హామీ ఇచ్చారని ఆయనను కలిసిన తెరాస ఎంపీలు మీడియాకు వెల్లడించారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు నేతృత్వంలో టీఆర్ఎస్ ఎంపీలు గురువారం ఉదయం రాజ్‌నాథ్‌తో సమావేశమైన విషయం తెల్సిందే. 
 
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాదుపై అధికారాలను గవర్నరుకు అప్పగించడంపై ప్రధానంగా తమ భేటీలో చర్చించినట్టు చెప్పారు. విభజన చట్టం సెక్షన్-8 కింద రాష్ట్రాల అధికారాలను కేంద్రం తీసుకోవడం సరికాదని హోంమంత్రికి చెప్పామని వారు తెలిపారు. గవర్నరుకు ప్రత్యేక అధికారాలు కల్పించడం... రాష్ట్రాల హక్కులను హరించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
కేంద్ర ప్రభుత్వం సమాఖ్య విధానాన్ని గౌరవించాలని చెప్పారు. భేటీ సందర్భంగా... అన్ని రాష్ట్రాల్లాగే తెలంగాణకు కూడా అధికారాలుంటాయని... రాష్ట్ర అధికారాలను హరించి వేయమని రాజ్‌నాథ్ హామీ ఇచ్చారని కె కేశవ రావు వెల్లడించారు.