శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : గురువారం, 27 డిశెంబరు 2018 (17:15 IST)

అధ్యాపకుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలను వాట్సాప్‌లో పెట్టాలని?

కామాంధులు ఎక్కడపడితే అక్కడ విరుచుకుపడుతున్నారు. లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన డిగ్రీ విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేశాడో టీచర్. ఈ వేధింపులు రెచ్చిపోవడంతో బాధితురాలు షీటీమ్‌ను ఆశ్రయించింది. 
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మల్కాజ్‌గిరి సాయినాథ్‌పురానికి చెందిన విద్యార్థిని ఈసీఐఎల్‌లోని మహిళా డిగ్రీ కాలేజీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. అదే కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న కుషాయిగూడకు చెందిన బి. సాగర్ రెండు నెలలుగా ఆ విద్యార్థినిని లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు.
 
వాట్సాప్‌లో ఆ విద్యార్థినికి అభ్యంతరకర మెసేజ్‌లు పంపుతున్నాడు. ప్రైవేట్ ఫోటోలను కూడా వాట్సాప్‌లో పెట్టాలని బలవంతం చేసేవాడు. ఈ వేధింపులు పెచ్చరిల్లడంతో బాధిత విద్యార్థిని షీటీమ్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.