1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : సోమవారం, 30 మార్చి 2015 (19:37 IST)

ఎన్నికల్లో పాల్గొనాలంటే కడియం, తలసానికి దడ!: ఎర్రబెల్లి

ఎన్నికలు అంటేనే కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస యాదవ్‌కు భయమని టీటీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు ఎద్దేవా చేశారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన తలసాని, ఎంపీగా వుండి తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పదవి చేపట్టిన కడియం శ్రీహరి తమ పదవులకు రాజీనామా చేయడానికి భయపడుతున్నారని చెప్పారు. 
 
అలాగే తమ పదవులకు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలలో పాల్గొనాలంటే వాళ్ళకి దడ పుడుతోందని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల కాలంలోనే ప్రభుత్వం మీద తెలంగాణ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ప్రస్తుతం ఉప ఎన్నికలు జరిగిన పక్షంలో టీఆర్ఎస్ గెలిచే అవకాశమే లేదని ఎర్రబెల్లి వెల్లడించారు.