శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By CVR
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (12:13 IST)

జయలలితకు ఫోన్‌చేసి అభినందనలు తెలిపిన కేసీఆర్

తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టనున్న అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి జయలలితకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు.  అన్నా డీఎంకే శాసనసభాపక్ష నాయకురాలిగా మరోసారి పార్టీ ఎమ్మెల్యేలు జయను ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్  శుక్రవారం ఉదయం జయలలితకు ఫోన్‌చేసి శుభాకాంక్షలు చెప్పారు. 
 
అక్రమాస్తుల కేసులో జయ నిర్దోషి పేర్కొంటూ కర్ణాటక హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆమో మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ స్థితిలో శుక్రవారం ఉదయం ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం రాజీనామా లేఖను ఆ రాష్ట్ర గవర్నర్ రోశయ్యకు  అందజేశారు. ఈ నేపథ్యంలో శనివారం జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.