శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 14 అక్టోబరు 2019 (10:56 IST)

ముగ్గురిని చంపి ఆత్మహత్య చేసుకున్నాడు... ఎందుకు?

అన్నను, అన్న కూతురిని, తన సొంత కూతురిని చంపాడు. ఆపై తాను గొంతు కోసుకున్నాడు. అనంతరం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

కామారెడ్డి జిల్లాలో ముగ్గురు కుటుంబ సభ్యులను హత్య చేసిన నిందితుడు.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిన్న దోమకొండ సమీపంలోని అటవీ ప్రాంతంలో భిక్కనూర్ మండలం జంగంపల్లికి చెందిన బందెల రవి.. తన అన్న బాలయ్య, బాలయ్య కూతురు లత, తన సొంత కూతురు చందనను శీతల పానీయంలో పురుగుల మందు కలిపి తాగించి... ఆపై గొంతు కోసి చంపేశాడు.

అనంతరం తాను కూడా గొంతు కోసుకుని సమీపంలోని గుండ్ల చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్నటి నుంచి రవి కోసం గాలించినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. ఈరోజు చెరువులో మృత దేహం బయట పడింది. అన్న పెద్ద కూతురు దీప... తన భార్య తరఫు అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఇది తట్టుకోలేక పోయిన రవి పరువు హత్యలకు పాల్పడ్డాడు. ఒక్క ప్రేమ వివాహం నలుగురిని మింగేయడం గ్రామస్థులను కలిచి వేసింది.