గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: శనివారం, 12 జనవరి 2019 (15:12 IST)

పెళ్లి చేసుకుంటాడని సర్వం అర్పించింది... నెల రోజుల తర్వాత ఆ పని చేశాడు...

ప్రేమ పేరుతో మోసపోయే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. నడి వయస్సులో ప్రేమ పేరుతో ఇంట్లో తల్లిదండ్రులను ఎదిరించి ప్రియుడితో పాటు బయటకు వచ్చేస్తున్న యువతుల పరిస్థితి హీనంగా మారిపోతోంది. చివరకు ప్రేమించినవాడు మోసం చేశాడని తెలుసుకుని లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్నారు.
 
హైదరాబాద్ లోని ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా అది. భరత్, రోజాలు స్థానికంగా ఒక ప్రైవేటు కళాశాలలో బి.ఎ. చదువుతూ ప్రేమించుకున్నారు. కుమార్తె ప్రేమ విషయం తెలియని తల్లిదండ్రులు ఆమెకు వేరే సంబంధం చూసి పెళ్ళి ఫిక్స్ చేశారు. లగ్న పత్రికలు రాసుకునే ముందు రోజు భరత్ రోజాను ఒప్పించి ఇంటి నుంచి తీసుకెళ్ళిపోయాడు. నెలరోజుల పాటు దిల్‌సుఖ్ నగర్‌లో కాపురం పెట్టాడు. 
 
ప్రియుడు పెళ్ళి చేసుకుంటాడన్న నమ్మకంతో అతనికి సర్వస్వం అప్పజెప్పింది యువతి. చివరకు నెలరోజుల పాటు ఆమెతో గడిపి రెండురోజుల క్రితం ఉడాయించాడు. ఇక చేసేది లేక యువతి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెద్ద మనస్సున్న తల్లిదండ్రులు ఆ యువతిని చేరదీశారు.