శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: గురువారం, 5 డిశెంబరు 2019 (17:02 IST)

దిశ ఘ‌ట‌న‌పై గ‌వ‌ర్న‌ర్‌కి 'మా' క‌మిటీ విన్న‌పం

హైద‌రాబాద్‌లో దిశ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. పశు వైద్యురాలు హ‌త్యోదంతంపై ప‌లువురు సినీ తారలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డ‌మే గాక ఆ ఘ‌ట‌న‌కు కార‌కులైన దోషులకు మ‌ర‌ణ‌ దండ‌న విధించాల‌ని డిమాండ్ చేశారు. 
దిశ హ‌త్య‌చారం లాంటి ఘ‌ట‌న‌లు తిరిగి పున‌రావృతం కాకుండా జాగ్ర‌త్త ప‌డాల‌ని, దిశ‌కు జ‌రిగిన అన్యాయం వేరొక‌రికి జ‌ర‌గ‌కూడ‌ద‌ని, ఈ కేసుపై వేగంగా ద‌ర్యాప్తు జ‌రిపి తొంద‌ర‌గా దోషుల‌కు శిక్ష ప‌డేలా చేయాల‌ని కోరుతూ తెలంగాణ గ‌వ‌ర్నర్ తమిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌ని మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ప్ర‌తినిధులు క‌లిశారు.
 
`మా` జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ జీవిత రాజ‌శేఖ‌ర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజ‌శేఖ‌ర్.. ఉపాధ్య‌క్షురాలు హేమ‌.. అనిత చౌద‌రి.. జ‌య‌ల‌క్ష్మి త‌నీష్‌, సురేష్ కొండేటి.. ఏడిద శ్రీ‌రామ్.. ర‌వి ప్ర‌కాష్ త‌దిత‌రులు గ‌వ‌ర్న‌ర్‌కి విన్న‌వించారు.