1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (13:32 IST)

అర్థరాత్రి వివాహితతో ప్రియుడు, పక్కగదిలో దాక్కున్న మహిళ భర్త ఏం చేశాడంటే...

మహిళతో వివాహేతర సంబంధం అతడి ప్రాణం తీసింది. వివాహిత మహిళతో సంబంధం పెట్టుకున్న సంగతి ఇరు కుటుంబాలకు తెలిసి గొడవకు దారి తీసింది. ఐతే విషయం పెద్దల వద్దకు వెళ్లడంతో పంచాయతీ పెట్టి ఇకపై ఆ మహిళకు దూరంగా వుండాలని హెచ్చరించి వదిలేశారు. కానీ అతడు మాత్రం తన బుద్ధి మార్చుకోలేదు.
 
వారం తిరగక ముందే మళ్లీ అర్థరాత్రి వేళ వివాహిత వద్దకు వచ్చి తన కోర్కె తీర్చాలంటూ గొడవకు దిగాడు. అప్పటికే పక్క గదిలో మాటు వేసి వున్న మహిళ భర్త, మరికొందరు అతడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు. తన భార్యతో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడన్న కసికొద్దీ మహిళ భర్త కొయ్య తీసుకుని గొడ్డును బాదినట్లు బాదాడు.
 
ఆ దెబ్బలు తాళలేక బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడు చనిపోయాడని తెలుసుకున్న తర్వాత మహిళ భర్త అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మహబూబ్ నగర్ లో చోటుచేసుకుంది. మృతుడు రాములుది జానంపేట కాగా మహిళది తిమ్మాపూర్.