శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : ఆదివారం, 29 నవంబరు 2015 (18:47 IST)

ఓటుకు నోటు కేసులో నిర్దోషిగా బయటపడతా.. బెదిరిస్తున్నారు: మత్తయ్య

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తాను నిర్దోషిగా బయటపడతానని జెరూసలెం మత్తయ్య ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ నేతల నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని మత్తయ్య ఆరోపించారు. దళిత క్రైస్తవుల సమస్యలపై పోరాటం చేస్తానని విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.
 
ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ నివేదికలో తన పేరు ఉన్నంత మాత్రాన తాను దోషిని కానని, నిర్దోషిగా బయటపడతానని ధీమా వ్యక్తం చేశారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పడాలని కొంతమంది కోరుకుంటున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సఖ్యతతో మెలగాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.