గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 మార్చి 2018 (09:04 IST)

చాక్లెట్ ఇస్తానని చెప్పి బాలికను ఇంటిలోకి తీసుకెళ్లి...

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. అభంశుభం తెలియని ఓ బాలికకు చాక్లెట్ ఆశచూపి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే,

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. అభంశుభం తెలియని ఓ బాలికకు చాక్లెట్ ఆశచూపి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఖమ్మం పట్టణంలోని ప్రశాంతి నగర్‌కు చెందిన ఓ కుటుంబం ప్రగతి స్కూల్‌ ప్రాంతంలో అద్దెకు ఉంటున్నారు. వీరికి ఐదేళ్ల కుమార్తె ఉంది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటి ఎదురుగా ఉంటున్న యువకుడు చాక్లెట్‌ ఇస్తానని ఆ బాలికకు ఆశచూపాడు. దీంతో చాక్లెట్ కోసం ఆ బాలిక యువకుడి వెంట వెళ్లింది. 
 
ఇలా ఇంట్లోకి తీసుకెళ్లిన ఆ యువకుడు బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక భయంతో కేకలు వేయడంతో బెదిరిపోయిన యువకుడు అక్కడ నుంచి పారిపోయాడు. ఆ తర్వాత చిన్నారి ఏడుస్తుండటంతో ఆమె తల్లి దండ్రులు విచారించగా జరిగిన విషయం చెప్పింది. 
 
వారు పరిశీలించగా ఆ చిన్నారికి రక్తస్రావం అవుతుండటంతో ఆ యువకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, అప్పటికే ఆ కామాంధుడు పారిపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.