శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (10:51 IST)

ఐఏఎస్ స్మితా సభర్వాల్‌కు న్యాయ సాయం: కోర్టులో మరో పిల్

ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్‌కు న్యాయ సాయం పేరిట తెలంగాణ ప్రభుత్వానికి మంజూరు చేసిన రూ.15 లక్షలను నిలిపివేయాలని కోరుతూ మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. గురువారం ఈ వ్యవహారంపై ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టులో హైదరాబాదుకు చెందిన సామాజిక కార్యకర్త వత్సల విద్యాసాగర్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో.. తాజాగా హైదరాబాదుకే చెందిన ఈశ్వరరావు అనే వ్యక్తి మరో పిల్ దాఖలు చేశారు. 
 
ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన స్మితా సభర్వాల్‌పై ‘ఔట్ లుక్’ పత్రిక కథనం రాసిందని, ఆ కథనం తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించిందని భావించిన స్మితా కోర్టెక్కారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారమంతా పూర్తిగా స్మితా సభర్వాల్ వ్యక్తిగతమైందని తెలిపారు. దీని కోసం ప్రభుత్వం సాయం చేయడమేమిటని స్మితా సబర్వాల్ అడిగారు. తక్షణమే ఆ నిధుల విడుదలను నిలిపివేయాలని ఆయన కోర్టును కోరారు.