శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : గురువారం, 26 నవంబరు 2015 (13:30 IST)

లాడ్జిలో విద్యార్థినితో గడుపుతూ అడ్డంగా బుక్కైన టీచర్.. అత్యాచారం కేసు నమోదు

పదో తరగతి విద్యార్థినికి మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లి రాసలీలలు కొనసాగించిన ఉపాధ్యాయుడిపై తెలంగాణ రాష్ట్ర పోలీసులు అత్యాచారం కేసును నమోదు చేశారు. అలాగే, అతనిపై కఠిన చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. 
 
ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన నాగేశ్వరరావు అనే టీచర్ తాను పనిచేస్తున్న పాఠశాలకు చెందిన విద్యార్థినికి మాయమాటలు చెప్పి లాడ్జీకి తీసుకొచ్చి రాసలీసలు కొనసాగిస్తుండగా, పోలీసులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని కుటుంబం అక్కడకు చేరుకుని నాగేశ్వరరావుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమాయకురాలైన తమ కూతురుకు మాయమాటలు చెప్పి తీసుకొచ్చిన నాగేశ్వరరావు అత్యాచారం చేశాడని ఆ ఫిర్యాదులో బాలిక తల్లిదండ్రులు పేర్కొన్నారు. దీంతో నాగేశ్వరరావుపై అత్యాచారం ఆరోపణల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.