శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : మంగళవారం, 30 జూన్ 2015 (11:23 IST)

కేసీఆర్‌కు అస్వస్థత: జ్వరంతో అపాయింట్‌మెంట్లన్నీ రద్దు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ మంగళవారం స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. కేసీఆర్ జ్వరంతో బాధపడుతుండటంతో ఆయన గతంలో ఇచ్చిన అపాయింట్‌మెంట్లను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్నారని సీఎం కార్యాలయం తెలిపింది. 
 
ఇకపోతే.. మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ ఇచ్చే విందుకు కేసీఆర్ హాజరు కావాల్సివున్న సంగతి తెలిసిందే. అపాయింటుమెంట్లన్నీ రద్దు చేయడంతో, ఆయన రాజ్ భవన్‌కు వెళ్తారా? లేదా? అన్న విషయంలో సందిగ్ధత నెలకొంది. 
 
మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు డీజీపీ రాముడుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై వీరిద్దరూ చర్చ జరిగినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది? ఎవరిపై జరిగింది? పాల్గొన్న అధికారులు ఎవరు? తదితర విషయాలపై బలమైన సాక్ష్యాలు సేకరించాలని బాబు సూచించినట్టు తెలుస్తోంది.