1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2015 (13:17 IST)

భార్య నగలు దొంగిలించాడనీ.. వివాహా విందులో అల్లుడిపై మేనమామ కత్తితో దాడి...

హైదరాబాద్ నగరం హత్యలు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్, ఇతరాత్రా నేరాలకు అడ్డాగా మారిపోతోంది. అలాగే, హైదరాబాద్ ఓల్డ్ సిటీ (పాతబస్తీ) హత్యల బస్తీగా మారిపోతోంది. ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా చైన్ స్నాచింగ్ దొంగలతో నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. గతవారం జట్కా బండి కోసం పాతబస్తీలో ముగ్గురు వ్యక్తుల మధ్య ఘర్షణ జరుగగా, ఓ వ్యక్తి మృత్యువాతపడ్డారు. ఇపుడు ఇదే ప్రాంతంలో మరో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. 
 
ఈ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే పాతబస్తీ పరిధిలోని భవానీ నగర్‌లోని హైదయత్ ఫంక్షన్ హాలులో ఆదివారం ఓ వివాహ విందు జరిగింది. ఈ విందు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అహ్మద్ అనే యువకుడిపై సొంత మేనమామ కత్తితో దాడి చేశాడు. తన భార్య నగలను అహ్మద్ దొంగిలించాడన్న అక్కసుతో ఆ యువకుడిపై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అహ్మద్‌ అక్కడే కుప్పకూలిపోయాడు.
 
ఆ తర్వాత విందు భోజన కార్యక్రమానికి వచ్చిన వారంతా హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అహ్మద్ అప్పటికే మరణించినట్టు వైద్యులు చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే నిందితుడు పారిపోయాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.