శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2015 (12:30 IST)

మే 15న 'శివ' రీ రిలీజ్.. రూ. 5 కోట్లతో హంగులు..!

అక్కినేని నాగార్జున 1989లో నటించిన చిత్రం 'శివ'. అప్పట్లో తెలుగు సినీ పరిశ్రమను ఒక ఊపు ఊపిన ఈ చిత్రం పలు రికార్డులను సృష్టించింది. తెలుగు సినిమాలను 'శివ' తర్వాత, ముందు అని విభజించే స్థాయికి విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఐదు కోట్ల రూపాయలతో సరికొత్త సాంకేతిక హంగులను జోడించి, మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. 
 
తాజాగా 'శివ' చిత్రాన్ని మే నెల 15వ తేదిన గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు నాగార్జున సన్నాహాలు చేస్తున్నారు. ఒక కొత్త చిత్రానికి ప్రమోషన్ చేసే స్థాయిలో దీనికి కూడా చేస్తారట. అందుకోసం మొత్తం 20 ట్రైలర్స్‌ను కట్ చేస్తున్నట్టు సమాచారం. పాతికేళ్ల క్రితం ప్రేక్షలను అలరించిన 'శివ' నేటి తరం ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుందని నాగ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కాగా నాగార్జునతోపాటు, చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ, నాగార్జున సతీమణి అమల, చిత్ర యూనిట్ అంతా 'శివ' చిత్రం రీ రిలీజ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు సమాచారం.