అపోలోలో గుణశేఖర్.. రుద్రమదేవి ఏమౌతుంది అందరికీ షాక్?
'రుద్రమదేవి' దర్శకుడు గుణశేఖర్ అపోలో ఆసుపత్రికి వెళ్ళినట్లు తెలిసింది. అక్కడ ఆయన్ను చూసివారంతా షాక్ అయ్యారట. కానీ తన యూనిట్ సభ్యుడ్ని చూడ్డానికే గుణశేఖర్ వచ్చినట్లు తెలుస్తోంది. రుద్రమదేవి సినిమా షూటింగ్ సమయంలో యాక్షన్ సీన్స్లో స్టంట్గ్రూప్లో ఒకతను తీవ్రగాయాలవడంతో పాటు వెన్నునొప్పి విపరీతంగా రావడంతో... ఆయన్ను హుటాహుటిన జూబ్లీహిల్స్లోని అపోలోకు తరలించినట్లు సమాచారం.
ప్రస్తుతం గోనగన్నారెడ్ది పాత్ర అల్లు అర్జున్పై కీలకసన్నివేశాలు తీస్తున్నారు. నానక్రామ్గూడా ఔటర్రింగ్ సమీపంలో ఈ చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. యాక్షన్ సినిమాలంటే ఇలాంటివి మామూలేననీ, ఫైటర్లు తమ జీవితాలను ఒక్కోసారి రిస్క్చేయాల్సివస్తుందని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా... కొన్నిసార్లు ఇలా జరుగుతుంటాయని ఫైట్మాస్టర్లు రామ్లక్ష్మణ్లు ఓ సందర్భంలో తెలియజేశారు. ఇటీవలే ఈ చిత్రంలో అనుష్క ధరించే నగలు మాయమయ్యాననీ, కొద్దిరోజులు డ్రామా తర్వాత అవి దొరికిన విషయం తెలిసిందే.