విజయ్ 'కత్తి'కి పట్టిన తుప్పును సెంటిమెంట్తో వదిలిస్తాం.. మురగదాస్
తమిళ హీరో విజయ్, సమంతా నటించిన తాజా చిత్రం 'కత్తి'. ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్నో ఆంటకాలకు గురవుతోంది. ఫలితంగా పైసా ఖర్చు లేకుండానే మంచి పబ్లిసిటీని కూడా సొంతం చేసుకుంటోంది. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ రూపొందిస్తున్న ఈ సినిమాను అదే పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు.
ఈ చిత్రంపై దర్శకుడు మురుగదాస్, హీరో విజయ్లు మాట్లాడుతూ టైటిల్ని బట్టి ఇదేదో యాక్షన్ సినిమా అనుకుంటారనీ, అయితే ఇది పూర్తి యాక్షన్ ఫిలిం కాదనీ వివరించాడు. హృదయాలను హత్తుకునే సెంటిమెంటు, డ్రామా కూడా ఉన్నాయనీ, వినోదం పాలు కూడా ఎక్కువేననీ చెప్పారు.
ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఆడియో వేడుకను ఈ నెల 24న హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. చిత్రాన్ని ఈ నెల 31వ తేదీన రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 'తుపాకి' తర్వాత మురుగదాస్, విజయ్ కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండడంతో మంచి క్రేజ్ వుంది. అలాగే, సమంతా గ్లామర్ కూడా దానికి తోడవుతోంది.
కాగా, ఈ చిత్రానికి శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్సే సోదరుడు ఫైనాన్స్ చేసినట్టు ఆరోపణలు రావడంతో అనేక సమస్యల్లో చిక్కుకుంది. ఫలితంగా ఈ చిత్రం చెన్నైలో విడుదల కానున్న ప్రముఖ థియేటర్పై కొందరు ఎల్టీటీఈ సానుభూతిపరులు దాడి చేసి అద్దాలను కూడా ధ్వంసం చేశారు. అయినప్పటికీ ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి విడుదల చేస్తామని హీరో, దర్శకుడు వెల్లడించారు.