అజిత్తో రొమాన్స్ చేసేందుకు అనుష్క, త్రిష రెడీ!
అందగాడు అజిత్తో రొమాన్స్ చేసేందుకు అనుష్క, త్రిష రెడీ అవుతున్నారు. అజిత్, గౌతమ్ మీనన్ కాంబినేషన్లో రూపొందుతున్న 'ఎన్నై అరింధాల్' తమిళ చిత్రం తెలుగు వెర్షన్కు పేరు ఖరారు చేశారు.
'ఎంత వాడు గాని...' పేరిట దీనిని తెలుగులోకి అనువదిస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. అజిత్ 55వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నారు. హ్యారిస్ జైరాజ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు.
వచ్చే సంక్రాంతికి తమిళ వెర్షన్ని రిలీజ్ చేయడానికి నిర్మాత ప్లాన్ చేస్తున్నారు. మరి, తెలుగు వెర్షన్ని కూడా అదే సమయానికి రిలీజ్ చేస్తారో, లేక ఆ తర్వాత రిలీజ్ చేస్తారో ఇంకా వెల్లడి కాలేదు.