అఖిల్ను వెండితెరకు పరిచయం చేయనున్న వివి వినాయక్!?
యువసామ్రాట్ నాగార్జున తనయుడు అఖిల్ వెండితెర ప్రవేశం దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. ఇందుకోసం నాగార్జున ముమ్మర కసరత్తే చేస్తున్నారు. ఈ కసరత్తులో భాగంగా సరైన దర్శకుడి కోసం చేస్తున్న అన్వేషణలో భాగంగా ఆయనకు సెన్సేషనల్ డైరక్టర్ వివి వినాయక్ తారసపడ్డారు. దీంతో అఖిల్ను అతని చేతుల్లో ఉంచాలని నిర్ణయించుకున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
ముఖ్యంగా తాజాగా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ని 'అల్లుడు శీను' సినిమా ద్వారా వినాయక్ బాగా లాంచ్ చేశాడన్న పేరును కొట్టేశాడు. దీంతో అఖిల్ చిత్రానికి వినాయక్ను అడుగుతున్నట్టు చెబుతున్నారు. అయితే, వినాయక్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే. నిజానికి అనేక మంది దర్శకుల పేర్లను నాగార్జున పరిశీలించినప్పటికీ.. వారిలో ఏ ఒక్కరినీ ఆయన ఎంపిక చేయలేక పోయారు. దీంతో నాగ్ చూపు వివినాయక్పై పడింది.