ఏఎన్నార్ సెంటర్ అమ్ముతున్నారా? హాట్ టాపిక్ హల్చల్..!
అక్కినేని నాగేశ్వరరావు మృతి చెందిన తర్వాత ఆ ఫ్యామిలీకి సంబంధించిన అనేక వార్తలు మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోపై బ్యాంకు రుణాలు పొందిన సమాచారం వెల్లడి కాగా, తాజాగా హైదరాబాద్ బంజారా హిల్స్ ప్రాంతల్లో ఉన్న ఏఎన్నార్ సెంటర్ అమ్మాకానికి పెట్టారనే వార్త టాలీవుడ్ వర్గాల్లో హల్చల్ చేస్తుంది.
అయితే నిజంగానే అమ్ముతున్నారనే విషయంపై అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. అక్కినేని నాగేశ్వరరావు చనిపోయిన తర్వాత ఆయన పేరుతో ఉన్న ఈ సెంటర్ను అమ్మకానికి పెట్టారనే వార్త చర్చకు దారితీస్తుంది. ఇప్పటికే ఈ సెంటర్లో పలు కమర్షియల్ బిజినెస్లు జరుగుతున్నాయి.
అయితే అసలు ఏఎన్నార్ సెంటర్ను ఎందుకు అమ్ముతున్నారనే దానిపై క్లారిటీ లేదు. ఏదేమైనప్పటికీ అక్కినేని కుటుంబంలో ఏదో అలజడి చోటు చేసుకున్నట్టు సినీ వర్గాల టాక్.