థియేటర్లో రెస్పాన్స్ చూసి షాకయ్యాను - వి వి వినాయక్
తెలుగులో భారీ చిత్రాల నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించుకున్న బెల్లంకొండ సురేష్ తన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ను హీరోగా చేస్తూ వినాయక్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ పతాకం పై బెల్లంకొండ సురేష్ నిర్మించిన చిత్రం అల్లుడు శీను. ఈ చిత్రం ఇటివలే విడుదలై అన్ని కేంద్రాల్లో మంచి కలక్షన్స్ వసూలు చేస్తూ మంచి హిట్ టాక్ను సొంతం చేసుకుంది.
ఈ సందర్బంగా దర్శకుడు వినాయక్ తన ఆనందాన్ని పాత్రికేయులతో పంచుకున్నారు. అల్లుడు శీను అందరికి నచ్చాడు. విడుదలైన అన్నిచోట్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులు బాగుందని అంటున్నారు. ఈ రోజుకి కూడా మంచి కలక్షన్స్ వస్తున్నాయి . అలాగే శ్రీనివాస్ కొత్త హీరో అయినా సరే చాలా బాగా చేసాడు. ఈ సినిమా కేవలం నా ఒక్కడి వల్లే ఈ హిట్ రాలేదు. నాపేరుకోసం అయితే ఓపెనింగ్స్ వస్తాయేమో కాని సినిమా ఇన్నిరోజులు ఇంత మంచి కలక్షన్స్ రావు కదా.
ఈ సినిమా ముఖ్యంగా బి సి సెంటర్ లలో బాగా ఆడుతుంది. నాకు ఆ సింటర్లలో మొదటినుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా ఒక్క నైజాంలోనే నాలుగు రోజులకు దాదాపు 5 కోట్లకు పైగా వసూలు చేసింది. సినిమాలో అన్ని అంశాలను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా భారీగా ఖర్చు పెడదామని సురేష్ గారు అన్నారు. కానీ ఇప్పటికే చాలా గ్రాండ్ లుక్లో సినిమా వచ్చింది. ఈ సినిమాను ఆదరిస్తున్న మీ అందరికి నా ధన్యవాదాలు అన్నారు.