నేను కొత్తగా నిరూపించుకునేదేముంది : అంజలి
తెలుగు చిత్ర పరిశ్రమలో తాను కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదని నటి అంజలి చెప్పుకొచ్చింది. ఆమె నటించిన తాజా చిత్రం ‘గీతాంజలి’ ఇటీవల విడుదలైంది. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మించిన సినిమా ఇది. కోన వెంకట్ సమర్పించారు. రాజకిరణ్ దర్శకత్వం వహించారు. బ్రహ్మానందం, శ్రీనివాసరెడ్డి, హర్షవర్ధన్ రాణే కీలక పాత్రల్లో నటించగా, ఈ చిత్రం సక్సెస్ మీట్ ఇటీవల జరిగింది.
ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ నా కెరీర్లో తొలిసారి డబుల్ రోల్ చేశాను. ‘గీతాంజలి’ హిట్ కావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది. నేనేంటో ఈ సినిమాతో నిరూపించుకున్నాను, ఇకపై కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదని చెప్పుకొచ్చింది.
అనంతరం కోన వెంకట్ మాట్లాడుతూ ‘కంటెంట్ సరైంది పడితే సినిమా హిట్ అని గీతాంజలి నిరూపించింది. మంచి టీమ్ పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ సినిమా. రాజ్కిరణ్ రాసుకున్న కథను తన అనుమతితో హారర్ కామెడీగా మార్చాను. వరుసగా సినిమాలు చేయాలన్న తాపత్రయం మాకు లేదు. మంచి కథ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాం. మా సంస్థ తదుపరి చిత్రం బ్రహ్మానందంగారి తనయుడు గౌతమ్తో ఉంటుందని చెప్పారు.